- Advertisement -
ప్రపంచకప్లో భాగంగా జరగుతున్న రెండో వార్మప్ మ్యాచ్ భారత్, బంగ్లా మధ్య జరనుంది. దీనిలో భాగంగా టాస్ గెలిచిన బంగ్లా భారత్పై ఫిల్డింగ్ ఎంచుకుంది. భారత్కు న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆరు వికెట్లతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక ఎలాగైనా ఈ మ్యాచ్లో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
అయితే రెండవ మ్యాచ్కు మాత్రం జట్టులో ఎటువంటి మార్పులు లేవు. కేదార్ జాదవ్ ఇంకా ఫిట్గా లేడని కోహ్లీ తెలిపాడు. ఇంగ్లండ్కు వచ్చిన రెండు రోజుల్లోనే వార్మప్ మ్యాచ్ ఆడామని, అందుకే సరిగా పర్ఫార్మ్ చేయలేకపోయినట్లు కోహ్లీ చెప్పాడు. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్నది.