Saturday, April 27, 2024
- Advertisement -

ఐపీఎల్ 2024..బోణి కొట్టిన ఆర్సీబీ

- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా బోణి కొట్టింది ఆర్సీబీ. తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలైన బెంగళూరు రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది. పంజాబ్ విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలిఉండగానే చేధించింది.

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేయగా చివరలో దినేష్ కార్తీక్ 28,లామ్రార్ 17 ధాటిగా ఆడటంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది.పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, రబడా తలో రెండు వికెట్లు తీయగా, సామ్ కరన్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్‌ ధావన్‌(45) ,ప్రభసిమ్రాన్ సింగ్ (25), జితేష్ శర్మ (27), సామ్ కరన్ (23), శశాంక్ సింగ్ (21) పరుగులు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -