ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్స్తో కలిపి ఇంకా పది మ్యాచ్ల లోపే మిగిలిఉండగా ఇంకా ప్లే ఆఫ్స్లో ఆడే జట్లు ఏవి అనేది మాత్రం కన్ఫామ్ కాలేదు. ఒక్క కేకేఆర్ తిరుగులేని విజయాలతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా మిగిలిన మూడు బెర్త్ల కోసం 6 జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో ఏ జట్టు ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయాన్ని నమోదుచేసినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసుకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవాళ జరిగే ఢిల్లీ-లక్నో మధ్య జరిగే మ్యాచ్లో ఢిల్లీ గెలిస్తే రాజస్థాన్ బెర్తును ఖాయం చేసుకున్నట్టే.
చెన్నై 13 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉండగా ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలిఉంది. బెంగళూరుతో జరిగే ఈ మ్యాచ్లో సీఎస్కే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. లేదంఏ హైదరాబాద్, లక్నో జట్లు తమ తదుపరి మ్యాచ్లలో ఓడితే ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది.
సన్రైజర్స్ 7 విజయాలతో 14 పాయింట్లతో ఉండగా మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ రెండింటిలో హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్స్కే కాదు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక ఆర్సీబీ వరుసగా ఐదు విజయాలతో 12 పాయింట్లతో ఉండగా 18న సొంతగడ్డపై చెన్నైతో తలపడనుండగా భారీ రన్రేట్తో విజయం సాధించి తీరాలి. ఢిల్లీ…లక్నోతో మ్యాచ్లో గెలిచి లక్నో, హైదరాబాద్ తమ మిగిలిగిన మ్యాచ్లలో ఓడితే అప్పుడు ఢిల్లీకి అవకాశముంటుంది. లక్నో సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానం ఉండగా మరో రెండు మ్యాచ్లలో గెలిస్తే 16 పాయింట్లకు చేరుతుంది.