ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇవాళ జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్తో తలపడనుంది హైదరాబాద్. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఓడిన హ:దరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచి సత్తాచాటాలాని భావిస్తోంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును ఓడించిన రాజస్థాన్ అదే జోష్ని కంటిన్యూ చేసి ఫైనల్లో అడగుపెట్టాలని భావిస్తోంది. చిదంబరం స్టేడియంలో ఈ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో భారీ స్కోరు నమోదు కాగా, కొన్నింట్లో మాత్రం తక్కువగా నమోదైంది.
జట్టు (అంచనా)
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్ కాడ్మోర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్
హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, నటరాజన్