ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలెంజ్లు ఎక్కువయ్యాయి. మొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఫిట్నెస్ చాలెంజ్కు స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కదులుతున్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేసి, మళ్లీ కారు ఎక్కడం ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్. అయితే, ప్రమాదకరమైన ఈ ఛాలెంజ్ పై పలు విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసులు అయితే ఏకంగా సెలబ్రిటీలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా మరో ఛాలెంజ్ తెరపైకి వచ్చింది. అయితే ఇది కారు, బైక్ ల ఛాలెంజ్ కాదు. క్రికెట్ క్యాచ్ ల ఛాలెంజ్.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సహచరులు, మాజీ క్రికెటర్లకు క్విర్కీ క్యాచ్ ఛాలెంజ్ విసిరాడు. దీనికింద కేవలం 8 సెకన్లలో 6 క్యాచ్ లను మిస్ కాకుండా పట్టుకోవాలి. ‘సరే, 8 సెకన్లలో ఆరు వేర్వేరు క్యాచ్ లను ఒక్కటీ మిస్ కాకుండా పట్టుకోవాలి. మీరు సిద్ధమేనా?’ అంటూ విరారాట్ అవి ఎలా పట్టాలో కూడా విరాట్ కోహ్లి తాను పోస్టు చేసిన వీడియోలో చేసి చూపించాడు.
కేఎస్ రాహుల్, రషీద్ ఖాన్, డూప్లీసిస్, షకీబ్ అల్ హసన్ తో పాటు మాజీ క్రికెటర్లు జాంటీ రోడ్స్, గిబ్స్ కు సవాలు విసిరాడు. ఈ ఛాలెంజ్ లో టాప్ గా నిలిచిన ఇద్దరితో తాను పోటీ పడతానని చెప్పాడు. ఈ వీడియోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం కోహ్లి నాయకత్వంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడుతోంది. ఈ సిరీస్లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. తొలి రెండు టెస్టులు ఇంగ్లండ్ గెలవగా, మూడో టెస్టులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.