నారా లోకేష్కు ఏముహూర్తంలో ముద్దపప్పుని పేరే పెట్టారో గాని ఆపేరను నిజంగానే సార్థకత చేసుకుంటున్నాడు. ముద్దపప్పని ఒకసారికాదు చాలాసార్లు నిరూపించుకున్నారు. గూగుల్లో సెర్చ్ చేసినా నారాలోకేషే దర్శనమిస్తున్నారు ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే.
అనాలోచిత నిర్ణయాలు,మాటలతో పరువు పోగొట్టుకున్న ఐటీ.పంచాయితీరాజ్శాఖ మంత్రి నారాలోకేష్లో మార్పు కనిపిడంలేదు. తప్పులమీద తప్పలు చేస్తూ సోషియల్ మీడియా లో అబాసుపాయిన సంగతి తెలిసిందే. లోకేష్ చేస్తున్న తప్పులను ప్రతి పక్షం ఒక రేంజ్లో ఆడుకుంటోంది. లోకేష్ చేసిన తప్పులు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా జగన్ చేసిన రెండురోజుల దీక్షలో లోకేషే టార్గెట్గా మారారు. సందు దొరికి నప్పుడ డల్లా వాయించేస్తున్నారు.గూగుల్లో ఆంధ్రపప్పు అని సెర్చ్ చేసే సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ పేరు వస్తుందని…. ఆంధ్రపులి అని సెర్చ్ చేసే వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తుందని వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేశ్ అన్నారు. పారిపోయిన ఓ ఎమ్మెల్యే బీకామ్లో ఫిజిక్స్ ఉందని పేర్కొనగా… ఇంకో ఎమ్మెల్యే బీకామ్లో సీఈసీ ఉంటుందన్నారని గుర్తుచేశారు.
మంత్రి లోకేశ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి తేడా తెలియకుండా మాట్లాడారని… ఆంధ్ర పప్పు లోకేశ్ అని పేర్కొన్నందుకు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తాను అనడం కాదు గాని గూగుల్లోనే అలా వస్తున్నదని, గూగుల్ వాళ్లకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర పప్పు అంటే లోకేశ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే చెప్పారని గుర్తుచేశారు. ఆంధ్రపులి అన్నా, ఆంధ్రా నిప్పు అన్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబును, లోకేశ్ను చెమడాలు వలిచి కొట్టి పంపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
{youtube}GeSAGSFrKHs{/youtube}
Related