టెక్నో – ఎకనమిక్ ఫీజిబిలిటీ (టిఇఎఫ్) స్టేటస్ నివేదిక అందజేయకుండా అక్కడ మౌలిక వసతుల పేర ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు .
ఈ పరిణామం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా శ్రీముఖంగా చెప్తున్నాయి. రూ.2700 కోట్లతో 5132 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎడతెరిపిలేని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనికి ఎలాంటి అనుమతులనూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకోలేదని తెలుస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు అథారిటీ చైర్మన్ అజయ్ జైన్ సమక్షంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన బిడ్డర్ల సమావేశానికి హాజరయ్యాయి. జీఎంఆర్ – జీవీకే – టాటా – రిలయెన్స్ సహా మరో నాలుగు సంస్థలు భోగాపురం ఎయిర్ పోర్టు (ఎయిర్ స్రిఫ్) నిర్మాణం కోసమని ఈ సమావేశానికి హాజరయ్యాయి.
జీఎంఆర్ – జీవీకే గతంలో హైదరాబాద్ – బెంగళూరు ఎయిర్ పోర్టులను నిర్మించినప్పటికీ భోగాపురంలో ఎయిర్ పోర్టుకు వయబిలిటీ లేదని ఆ సమావేశం నుంచీ ఈ రెండు సంస్థలూ బయటకు వచ్చేశాయి. టాటా – రిలయన్స్ లతో పాటు పాల్గొన్న మిగతా సంస్థలకూ గతంలో ఎయిర్ పోర్టుల నిర్మాణంలో అనుభవం లేనందున వాటి బిడ్లను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. దీంతో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అనుమతులపై ప్రశ్నార్థకం తలెత్తింది.
Related