తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసే ప్రతి చిత్రం సూపర్ హిట్ అవుతుంది.. ఎందుకంటే ఆయన తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ ఇస్తుంటారు. తాజాగా దర్శకుడు శంకర్ పై చర్యలు తీసుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. శంకర్, లైకా మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో పెను సంచలనాలు సృష్టించిన భారతీయుడు మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
కమల్హాసన్ హీరోగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ పూర్తి చేసేవరకు శంకర్ వేరే సినిమాలకు దర్శకత్వం వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా గతంలో తమిళనాడు హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా విదితమే. కానీ ఆ స్టేకు హైకోర్టు నిరాకరించింది. అయితే తమిళనాడు హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంలో కమల్ హాసన్ సందికి ప్రయత్నించినా కుదరలేదని వార్తలు వచ్చాయి.
ఇటీవల డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో ఓ మూవీ తీయబోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శంకర్ తమిళనాడు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చెన్నయ్ లోనే విచారణ కొనసాగేలా చూడాలని శంకర్ కోర్టుకు విన్నవించారు.
ఇది మా తొలి విజయం.. ముందు ఉంది ముసళ్ల పండగ : వైఎస్ షర్మల