ఫ్యామిలీమ్యాన్ వెబ్ సీరిస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ -2 చిత్రం సంచలన విజయం నమోదుచేసుకుంది. ఈ చిత్రంలో నటించిన సమంతకు గొప్ప నటి అన్న పేరు తెచ్చిపెట్టింది. ఇక తమిళ ప్రజల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ.. సమంతకు మంచి పేరే తీసుకొచ్చింది. సమంతను నల్లగా చూపించడం ఆమె ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు. కానీ కథా పరంగా ఆమె ఎల్టీటీఐ ఉగ్రవాది కాబట్టి అలా చూపించవలసి వచ్చింది.
అయితే రాజ్ అండ్ డీకే తెలుగు వారేనన్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా వాసులు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు. అయితే ఇప్పుడందరి ఫోకస్ ఫ్యామిలీ మ్యాన్- 3 మీద పడింది. మూడో సీరిస్లో ఎటువంటి కథను చూపించబోతున్నారని అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై రాజ్ అండ్ డీకే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘ప్రస్తుతం మేమే ఫ్యామిలీ మ్యాన్ -3 కోసం కథను సిద్ధం చేస్తున్నాం. అయితే ఇందుకోసం ఆడియన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. వాళ్ల ఇష్టప్రకారమే కథను సిద్ధం చేస్తాం. ఇక సమంత రంగు విషయంలో విమర్శలు వస్తాయని మేము ముందే ఊహించాం’ అని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మ్యాన్ -2 క్లైమాక్స్ లో కరోనా వైరస్ గురించి హింట్ ఇవ్వడంతో .. ఫ్యామిలీ మెన్ – 3 లో కరోనా వైరస్.. దాని పుట్టుక తదితర విషయాల మీదే సాగుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
Also Read
జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి