ల‌క్ష‌కోట్ల‌పై సీబీఐ…మ‌రి ల‌క్షఎక‌రాల భూకుంభ‌కోనంపై సీబీఐ వ‌ద్దా బాబు….?

Andhra Political Heat Over Vishaka Land Scam

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ర‌జాకీయాలు చూస్తె ఆయ‌న‌ముందు దేశంలో అంద‌రూ దిగ‌దుడుపే అనిపిపంచ‌క‌మాన‌దు.ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి చిన్న విష‌యానికి సీబీఐ ని నానాయాగి చేసిన బాబు ఇప్పుడు మాత్రం సీబీఐ అంటేనే వ‌ణికిపోతున్నారు.ఎందుకంటె ఇప్పుడు సీఎంక‌దా.

త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ల‌క్ష‌కోట్లు సంపాదించార‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా కాకుండా దేశ‌వ్యాప్తంగా ర‌చ్చ‌ర్చ‌చేశారు చంద్ర‌బాబు.అప్ప‌టి అధికార‌,ప్ర‌తిప‌క్షాలు క‌లిసి కుట్ర‌ప‌న్ని జ‌గ‌న్‌మీద ప‌ట్టుబ‌ట్టి సీబీఐ వేయించారు.జ‌గ‌న్ జైలుకు వెల్ల బ‌య‌ట‌కు వ‌చ్చారు.ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్‌మీద ఉన్న అక్ర‌మాస్తుల‌కేసు ఓకొలిక్కిరాలేదు.

{loadmodule mod_custom,GA1}

వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ అవినీతికి పాల్పడుతోందనీ, రాజధాని పేరుతో లక్ష కోట్లకు పైనే భూ కుంభకోణానికి తెరలేపిందనీ అప్పట్లో ఆరోపించింది.రాజ‌ధానిలో మేము భూములు కొనొద్దాని టీడీపీ త‌మ్ముల్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు.
విశాఖ‌లో లక్ష ఎకరాల భూ కుంభకోణం ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. హుద్‌హుద్‌ తుపాను కారణంగా రికార్డులు గల్లంతయ్యాయంటూ, అధికారులు చేతులెత్తేయడం గమనార్హమిక్కడ.మొత్తం లక్ష ఎకరాల భూమి టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిందన్నది వైఎస్సార్సీపీ నేతల ఆరోపణ.

{loadmodule mod_custom,GA2}

వైఎస్‌ జగన్‌ లక్ష కోట్ల దోపిడీ అన్నది పాత మాట. రాజధాని అమరావతిలో భూముల్ని కొల్లగొట్టేయడం, విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణానికి తెరలేపడం, వీటితోపాటుగా కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌. ఇన్ని చోటు చేసుకున్నా సీబీఐ ఎంక్వ‌యిరీ వేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నా..సీఎం మాత్రంభ‌య‌ప‌డుతున్నారు.జ‌గ‌న్ ల‌క్ష‌కోట్లు ఎక్క‌వా….ల‌క్ష ఎక‌రాలు ఎక్కువా …?

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}XyXOrRAK1S8{/youtube}