విశాఖ టీడీపీలో మంత్రుల లొల్లి తారాస్తాయికి చేరడంతో …చంద్రబాబుకు ఊపిరి సలపడంలేదు. లక్ష ఎకరాల భూకుంభకోణానికి సంబందించి మంత్రుల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది.ఇద్దరు మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేసుకోవడం పార్టీలో కలవరం మొదలయ్యింది. సొంత పార్టీ నేతలే ఈ విధంగా ప్రవర్తిస్తే బాబుకు తలనొప్పిగా మారింది.
విశాఖ భూకుంభకోణంలో గంటా పాత్ర ఉందని అయ్యన్న విశాఖ వీధుల్లో గంటాను కడిగిపారేస్తున్నాడు. బయట నుంచి వచ్చిన వారి వల్ల విశాఖ పరువుపోతోందని, వేల కోట్ల భూకుంభకోణంలో వారి పాత్ర ఉందని సహచర మంత్రి గంటాను ఉద్ధేశించి తీవ్ర ఆరోపణలు చేశాడు.
{loadmodule mod_custom,GA1}
దీంతో ఆగ్రహం చెందిన గంటా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాడు. అయ్యన్న వ్యాఖ్యల వల్ల జిల్లాలో పార్టీ పరువు మంటగలిసి పోతోందని పార్టీ అధినేతకు కంప్లైంట్ చేశాడు. విశాఖ భూకుంభకోణంపై సొంత పార్టీ నేతలు, మిత్రపక్ష బీజేపీ నాయకులు సైతం విమర్శలు చేయడంతో కుంభకోణం విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశాడు సీఎం బాబు.
అయితే అయ్యన్నపై గంటా ఫిర్యాదు చేసిన విషయంలో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోకుండా ఉంది. విశాఖ భూ కుంభకోణంలో గంటా హస్తం ఉందని నిరూపించేందుకు అయ్యన్న వద్ద పక్కా సాక్షాధారాలున్నాయట. ఒకవేళ ముఖ్యమంత్రి అడిగితే వాటిని ఆయన వద్ద ప్రవేశపెట్టేందుకు అయ్యన్న వర్గం సిద్ధంగా ఉంది. అయితే అయ్యన్న ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. ఆయన విశాఖ రాగానే పత్రాలతో సీఎంను కలవాలని నిర్ణయించారట.
{loadmodule mod_custom,GA2}
అధికారపార్టీలోనే నేతల మధ్య భూ కంపం ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.దీంతో విశాఖ టీడీపీలో కలవరం మొదలయ్యింది.బాబుకు ఇద్దరు కూడా ముఖ్యం కావడంతో ఏనిర్ణయం తీసుకుంటారోనని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}5-ka5j8g93g{/youtube}