మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఒక రూంలోకి వెళ్లి తెగ ఏడిచాడట. ఈ విషయంను స్వయంగా వరుణ్ తేజ్ నిన్న మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చెప్పాడు. అయితే వరుణ్ తేజ్ గదిలోకి వెళ్లి ఇంతలా ఎందుకు ఏడిచాడో తెలుసా…. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత చిరంజీవి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళుతున్నాడు అనే విషయం తెలిసినప్పుడు తట్టుకోలేక గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడ్చాను అని చెప్పాడు వరుణ్.
ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో చాలాసార్లు నటించమని వరుణ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా చిరు పై వత్తిడి చేసారట. కానీ చిరంజీవి మాత్రం చేద్దాం.. చూద్దాం అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసేవాడట.
మొత్తానికి ఇన్నాళ్ళకు అందరి మొర ఆలకించాడని ఖైదీ నెంబర్ 150 తో మన ముందుకు వస్తున్నాడని అయితే ఇంతకుముందులా డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ చేయగలడా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారని అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ చెప్పి అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన స్పీచ్ తో మెగా ఫ్యాన్స్ చేత ఈలలు వేయించాడు వరుణ్ తేజ్.
{youtube}v=BH_mkFZomRo{/youtube}
Related