Wednesday, May 15, 2024
- Advertisement -

షాకుల మీద షాకులు ఇస్తున్న వరుణ్ తేజ్…

- Advertisement -

మొన్నటికి మొన్న శేఖర్ కమ్ములతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు వరుణ్ తేజ్. అప్పటి వరకూ శ్రీను వైట్ల తో సినిమా అనుకున్న వరుణ్ అది అటక ఎక్కించేసి మరీ శేఖర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరిప్పుడేమో శేఖర్ కమ్ములతో , హీరోయిన్ సాయి పల్లవి తో అందంగా రూమ్ లో కూర్చుని మరీ స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తూ కనిపించిన వరుణ్ తేజ్ సడన్ గా స్పెయిన్ చేక్కేస్తున్నాడు. స్పెయిన్ లో శ్రీను వైట్ల తో సినిమా కోసం వెళుతున్న వరుణ్ తేజ తాను శ్రీను కి హ్యాండ్ ఇవ్వలేదు అని మళ్ళీ నిరూపించుకున్నాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల ఇప్పటికే ఆగాడు ,బ్రూస్ లీ లాంటి షాక్ సినిమాలు ఇచ్చినా వరుణ్ అతనికి ఛాన్స్ ఇవ్వడం తో అందరూ మెచ్చుకున్నారు గానీ మళ్ళీ అదే వరుణ్ తేజ అతన్ని వద్దని శేఖర్ వైపు మొగ్గు చూపడం తో ఆశ్చర్యపోయారు.

కానీ అందరికీ భారీ షాక్ ఇస్తూ వరుణ్ స్పెయిన్ వెళుతున్నాడు. ‘మిస్టర్’ షూట్ కోసం స్పెయిన్ వెళుతున్నానని, కొత్త సినిమా మొదలైందని వరుణ్ స్పష్టం చేశారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -