- Advertisement -
నిన్న (బుధవారం)రీలిజ్ అయిన మహనటి సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది.దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని కొనియాడుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.
తాజాగా తెలంగాణా మినిస్టర్ కెటీఆర్ కూడా ఈ సినిమాపై కేటీఆర్ చేశారు.’మహానటి’ సినిమాను చూసిన ఆయన ఈ సినిమా ఒక అద్భుతమని అన్నారు. మహానటి ఓ మంచి అనుభవాన్ని మిగిల్చిందని, కీర్తి సురేష్ హన పాత్రలో స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచిందని అన్నారు. సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, స్వప్నా దత్ లకు నా శుభాకాంక్షలు అని వెల్లడించారు.