Thursday, May 9, 2024
- Advertisement -

ఆ మార్పు వస్తే చాలు..సామ్ ఎమోషన్!

- Advertisement -

ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సమంత. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోసే సమంతకు సౌత్‌లోనే కాదు నార్త్‌లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కొన్ని రోజులుగా మయోసైటిస్‌ తో బాధపడుతున్న సమంత…సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా తనకు ఆనందమేనని … కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అని తెలిపింది. ఎలాంటి సందర్భమైనా తన మనసుకు నచ్చింది మాత్రమే చేస్తానని..ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానన్నారు. మెంటల్‌ హెల్త్‌కు ప్రాధాన్యతనిస్తానని తెలిపింది సామ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -