- Advertisement -
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. చాలా కంపెనీలు ఈ హీరోని బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని ప్రపోజ్ చేస్తున్నప్పటికి , ప్రభాస్ మాత్రం కొన్నిటికి మాత్రమే ఒపుకుంటున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే మహేంద్ర కంపెనీకి బ్ర్రాండ్ అంబాసిడర్గా నేషనల్ లెవెల్లో ఉండేందుకు ప్రభాస్ ఇటివలే సైన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబందించి షూటింగ్ కు కూడా ఈ హీరో వెళ్ళనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఒప్పుకునేందుకు ఇంకా కొన్ని కంపెనీలు పరిశీలనలో ఉన్నాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
బాహుబలి తర్వాత ప్రభాస్కు అంత పేరు రాలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఈ దెబ్బతో ఆ మాటలు బ్రేక్ పడినట్లే.. ఎందుకంటే ప్రభాస్ కేవలం సౌత్ మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా నేషనల్ లెవెల్ లో ఉండడమే దీనికి కారణం.