బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఖండల వీరుడు సల్మాన్ ఖాన్ కుంటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. షూటింగ్ లకు ఏమాత్రం గ్యాప్ దొరికినా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పన్వేలిలో గల ఫామ్ హౌస్ కు వస్తుంటారు. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఎక్కువ సమయం అక్కడే గడిపాడు.
పన్వేలి ఫామ్ హౌస్ పక్కన కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి కూడా స్థలం ఉంది. ఇటీవల కేతన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ఫాం హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వెల్లడించాడు. మనుషుల అక్రమ రవాణా వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని అన్నాడు. అంతటితో ఆగకుండా అక్కడ కొంతమంది శవాలను కూడా పాతిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశాడు.
దీనిపై సల్మాన్ తన లాయర్లతో కలిసి కేతన్ పై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. సల్మాన్ ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. కాగా ఇటువంటి వార్తలను ప్రచారం చేసిన గూగుల్, యూట్యూబ్ లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.
Also Read: సీక్రెట్ గా తల్లైన ప్రియాంక చోప్రా