- Advertisement -
పాన్ ఇండియా హీరోయిన్గా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది నటి రష్మికా మందన్న. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రష్మికా…సౌత్తో పాటు నార్త్లోనూ భారీ ఆఫర్స్ను దక్కించుకుంటోంది.
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత మరో బిగ్గెస్ట్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న సికిందర్ సినిమాలో రష్మిక హీరోయిన్గా ఎంపికైంది. ఈ మేరకు మేకర్స్ అఫిషియల్గా ప్రకటించారు.
రష్మికాకు ఆహ్వానం పలుకుతున్నాం… వచ్చే ఈద్ పండక్కి తెరపై సల్మాన్ – రష్మిక అలరిస్తారని తెలిపారు. సల్మాన్ సరసన సికిందర్ మూవీలో నటించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా, గర్వంగా భావిస్తున్నా అని సోషల్ మీడియా ద్వార వెల్లడించింది రష్మికా. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉండగా ఆగస్టు 15న శ్రీవల్లిగా అలరించేందుకు రానుంది.