Monday, May 5, 2025
- Advertisement -

ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు

- Advertisement -

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలు, నంద‌మూరి ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ పడుతుంటారు. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల హీరోలు ఒకే సినిమాలో న‌టిస్తే అది వింతే అవుతుంది. ఈ రెండు కుటుంబాల‌కు చెందిన నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌-మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టిస్తున్నారు.

అయితే ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో ముందుగా అనుకున్న హీరోలు వేరా ? యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌-స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించాల్సి ఉందా ? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. అగ్ర నిర్మాత కేఎస్‌.రామారావు ఎన్టీఆర్‌-అల్లు అర్జున్‌ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్‌ను తయారు చేయించారట. ఈ స్టోరీ రెడీ చేసిన డైరెక్ట‌ర్ ఏఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి ముందుగా ఎన్టీఆర్‌,బ‌న్నీకే వినిపించాడ‌ట‌. అయితే వీరిద్ద‌రు ఈ స్టోరీపై ఆస‌క్తి చూప‌లేద‌ని స‌మాచారం. ఎలాగైనా నంద‌మూరి-మెగా హీరోల కాంబినేష‌న్‌లో సినిమా చేయాల‌ని కేఎస్ రామారావు ప‌ట్టుప‌ట్టార‌ట‌.

దీంతో ఆయ‌న స్క్రిప్ట్‌ను మ‌రో నంద‌మూరి యువ‌హీరో క‌ళ్యాణ్‌రామ్, సాయిధ‌ర‌మ్ వ‌ద్ద‌కు పంపించార‌ట‌. స్టోరీ విన్న ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో నటిస్తాం అని చెప్పారట. ఏదేమైనా బన్నీ చేయను అని చెప్పిన సినిమాని ధరం తేజ్ చేసి బన్నీకి షాక్ ఇచ్చాడు. అలాగే ఎన్టీఆ చేయను అని చెప్పిన సినిమాని కళ్యాణ్ రామ్ చేసి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చాడు. ఏదేమైనా ఈ స్టోరీని ఎన్టీఆర్‌-బ‌న్నీ ఓకే చేసి ఉంటే టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్‌గా మిగిలిపోయేది అని అంటున్నారు.

Related

  1. లుంగీ మీద బన్నీ ఊర మాస్ పార్టీ
  2. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!
  3. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  4. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -