మొదటి సినిమా ‘ఈశ్వర్’ లో పక్కా మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి ఆ తర్వాత సినిమాలు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సూపర్ హిట్ అవ్వడంతో ప్రభాస్ కి మంచి కాలం కలిసి వచ్చింది. ఆ చిత్రం తర్వాత మంచి హిట్స్ తో దూసుకెళ్ళాడు.
ఇక ‘బాహుబలి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ అంటే తెలుగు లోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరో. అలాంటి హీరోతో ఓ హీరోయిన్ గొడవ పెట్టుకుందట. అయితే అది ఇప్పుడు మాత్రం కాదు. గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కంగనా రౌనత్ షూటింగ్ సమయంలో చిన్న అభిప్రాయభేదాలు వచ్చాయట.
ఆ తర్వాత ఎలాగో అలా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఇద్దరు తర్వాత ఎప్పుడూ కలుసుకున్నదే లేదట. ఇక ఏక్ నిరంజన్ సినిమా టైమ్ లో ఇద్దరికీ పెద్ద పేరు లేదు..కానీ ఇప్పుడు ఈ ఇద్దరు టాప్ హీరో, హీరోయిన్లు. ఓ సందర్భంలో కంగనా హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పింది. కానీ ఇప్పుడు ప్రభాస్ ఏ విషయంలో గొడవ పెట్టుకున్న విషయం మాత్రం సీక్రెట్ గానే ఉంచింది.
{youtube}7OS52_OOx9I{/youtube}
Related