బాహుబలి ఎలాంటి విజయం సాధించిదో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాంతో ఇప్పుడు రాబోతున్న బాహుబలి 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బాహుబలి 2 కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే బాహుబలి 2 సంబంధించి ఏం రిలీజ్ అయిన పెద్ద సంచలనం అవుతుంది. ఇటివలే బాహుబలి 2 కి సంబంధించి ప్రభాస్, అనుష్క ల ఓ ఫోటో రిలీజ్ చేసిన యూనిట్.. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. బాహుబలి ఏనుగు పైకి ఎక్కేలా ఉన్న ఈ ఫోటో చాలా అద్భుతంగా వచ్చింది. దాంతో ప్రభాస్ పండగ చేసుకుంటున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రానా విలన్ గా నటిస్తుండగా.. అనుష్క, తమన్నా లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకా ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది.
{youtube}A0R-LT_DEoI{/youtube}
Related