ఉత్కంఠంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరిగింది. క్షణ క్షణం మలుపులు.. ట్విస్ట్లతో జో బైడెన్కు అమెరికా ప్రజలు జేజేలు పలికారు. 46వ అగ్రరాజ్యం అధినేతగా జో బైడెన్ ఎన్నికయ్యారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడు జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంపే అధికారంలో ఉంటారు.
అమెరికా ప్రభుత్వం దేశానికి సేవలందించినందుకు మాజీ అధ్యక్షులకు పింఛను ఇస్తుంది. ఇది ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగుల జీతంతో సమానం. అయితే, ఏటా సమీక్ష ఆధారంగా పింఛను మొత్తంలో మార్పులు జరుగుతాయి. అంతే కాకుండా మాజీ అధ్యక్షుడి భార్యకు కూడా పింఛను ఇస్తారు. అటు అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్న తరువాత 7 నెలల పాటు వారు వ్యక్తిగత ఆఫీస్ ఏర్పాటు చేసుకునేందుకు, అద్దె, టెలిఫోన్, ప్రింటింగ్, పోస్టల్ ఖర్చులకు నిధులను సర్కార్ ఇస్తుంది.
ప్రస్తుతం ఉన్న అమెరికా ప్రభుత్వం నిబందలన ప్రకారం ట్రంప్కు ప్రతి ఏడాదికి 2,19,200డాలర్లు దాదాపు రూ.1.6కోట్లు పింఛను అందనుంది. అంతే కాకుండ ట్రంప్ భార్యకు కూడా ఏడాదికి 20వేల డాలర్ల చొప్పున పింఛను ఇస్తారు.
దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?