గత కొన్ని సంవత్సారాలుగా స్వాతంత్య్రయం కోసం పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రయం కోసం పోరాటం చేస్తున్న ఆందోళనపై పాక్ ప్రభుత్వం, సైన్యం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పాక్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగుతూనె ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో సారి లండన్లో పాక్ వ్యతిరేకంగా బలూచిస్థాన్ ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు.
వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్’ మరోసారి భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించింది. లండన్ లోని ప్రజారవాణా వ్యవస్థను తమ ఉద్యమానికి ప్రచార అస్త్రంగా మలచుకుంది. ఫ్రీ బలోచిస్తాన్ (బలోచిస్తాన్ కు స్వాతంత్ర్యం కావాలి) అనే నినాదాలతో ఉన్న పోస్టర్లను లండన్ బస్సులపై ఉంచింది. లండన్ రోడ్లపై బలోచ్ నినాదాలతో పాకిస్థాన్ మరోసారి షాక్ కు గురైంది.
ఈ సందర్భంగా వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి భవల్ మెంగల్ మాట్లాడుతూ, బలోచ్ ప్రజల హక్కులను కాలరాస్తున్న పాకిస్థాన్ చర్యలను ఎండగడతామని తెలిపారు. బలోచిస్తాన్ లో మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ పై ప్రపంచానికి అవగాహన కల్పించేందుకే లండన్ లో మూడవ దశ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించామని చెప్పారు.
తొలుత తాము ట్యాక్సీలపై ప్రచారం చేశామని, ఆ తర్వాత రోడ్డు పక్కన హోర్డింగులతో ప్రచారం నిర్వహించామని, ఇప్పుడు బస్సులపై ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. అయితే, ఇదంతా పాక్ వ్యతిరేక ప్రచారమని, వీరు చేస్తున్న ప్రచారంలో అన్నీ అబద్దాలేనని పాక్ అధికారులు అంటున్నారు.