Thursday, May 8, 2025
- Advertisement -

రూ.200 కే హత్య.. మత్తు వదలదా..!

- Advertisement -

అలీగఢ్​లోని సివిల్​ లైన్స్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో గల షంషాద్​ మార్కెట్​లో అన్సర్​ అహ్మద్(30)​ మెకానిక్​గా చేసేవాడు. ​ముగ్గురు చిన్నారులకు తండ్రి అతడు.అసిఫ్​​ అనే ఓ వ్యక్తి శనివారం.. అహ్మద్​ షాపు వద్దకు వచ్చి, ఒక మోటార్​సైకిల్​ను కిరాయికి తీసుకున్నాడు. తర్వాత అదే రోజు మళ్లీ వచ్చి రూ.200 అప్పు ఇవ్వాలని అహ్మద్​ను ఒత్తిడి చేశాడు. ఆ డబ్బులిచ్చేందుకు అతడు నిరాకరించాడు.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అసిఫ్​.. ఓ నాటు తుపాకీతో అహ్మద్​ తలకు గురిపెట్టి కాల్చాడు. స్థానికులు అందరూ చూస్తుండగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు మత్తుపదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి అని అలీగఢ్​ ఎస్పీ అభిషేక్​ కుమార్​ తెలిపారు. అహ్మద్​ను​ కాల్చిన అనంతరం.. మోటార్​సైకిల్​తో సహా అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -