- Advertisement -
అలీగఢ్లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల షంషాద్ మార్కెట్లో అన్సర్ అహ్మద్(30) మెకానిక్గా చేసేవాడు. ముగ్గురు చిన్నారులకు తండ్రి అతడు.అసిఫ్ అనే ఓ వ్యక్తి శనివారం.. అహ్మద్ షాపు వద్దకు వచ్చి, ఒక మోటార్సైకిల్ను కిరాయికి తీసుకున్నాడు. తర్వాత అదే రోజు మళ్లీ వచ్చి రూ.200 అప్పు ఇవ్వాలని అహ్మద్ను ఒత్తిడి చేశాడు. ఆ డబ్బులిచ్చేందుకు అతడు నిరాకరించాడు.
ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అసిఫ్.. ఓ నాటు తుపాకీతో అహ్మద్ తలకు గురిపెట్టి కాల్చాడు. స్థానికులు అందరూ చూస్తుండగానే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు మత్తుపదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి అని అలీగఢ్ ఎస్పీ అభిషేక్ కుమార్ తెలిపారు. అహ్మద్ను కాల్చిన అనంతరం.. మోటార్సైకిల్తో సహా అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు.