- Advertisement -
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి వెళుతుండగా హాపూర్ జాతీయ రహదారిపై చాజర్సీ టోల్ గేట్ వద్ద జరిగిన ఘటనతో ఒక్క సారిగా కలకలం రేగింది.
ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అసద్ మీడియాతో మాట్లాడారు. తనపై జరిగిన దాడి కుట్ర అని అన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని కానీ అల్లా దయవల్ల బతికిబయట పడ్డానని అన్నారు.
మరో వారం రోజుల్లో ఉత్తర ప్రదేశ్ లో తొలిదశ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అసద్ యూపీలోని మేరఠ్ లోని కిథోర్లో జరిగిని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగిసిన అనంతరం నాలుగు వాహనాలలో ఢిల్లీకి బయలుదేరగా మార్గమధ్యంలో అసద్ పై దాడి జరిగింది.