కర్నూలు జిల్లాలో రైతు దంపతుల ఆత్మహత్యపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రామయ్య దంపతులది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చెయ్యడంతో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రోజా తెలిపారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపుతులు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలను ఇచ్చారని చెప్పారు. చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, విజయపాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయిని రోజా విమర్శించారు. తిరుపతి ఆర్టీసీ గ్యారేజ్ను ఇతర జిల్లాలకు తరలించేయత్నం జరుగుతోందన్నారు. ఈ గ్యారేజ్ కార్మికులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని రోజా స్పష్టం చేశారు.