ఏపీలో అధికార వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరియు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్య మాటల తుటాలు పెళుతున్నాయి. ఇటీవల విజయసాయి రెడ్డి పోన్ మిస్సింగ్ పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాన ఐఫోన్ పోయిందని ఈ నెల 21న విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం పోలీసులు ఫోన్ వెతికే పనిలో ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి పోన్ మిస్సింగ్ పై టిడిపి నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఫోన్ లో ఏమేమి రహస్యాలు ఉన్నాయో చెప్పాలని, డిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకుకే విజయసాయి రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. .
ఇదే విషయంపై నారా లోకేష్ కూడా తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ పోవడం సాధారణమైన విషయమని, కానీ విజయసాయి రెడ్డి ఎందుకంత కంగారూ పడుతున్నారని లోకేష్ ప్రశ్నించారు. ఆయన ఫోన్ లో ఉండే లావాదేవీలు బయటపడతాయనా ? లేదా ఆయన రాసలీలలు ఫోన్ ద్వారా బయట పడతాయనా ? లేదా బ్రెజిల్ లో ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతి బయటపడుతుందనా ? ఎందుకు విజయసాయి రెడ్డి ఫోన్ పోతే అంతా భయపడుతున్నారని.. లోకేష్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ” పప్పూ ..! వీడి పుట్టుకే దొంగ పుట్టుకా, వంట మనిషిని గర్భవతిని చేశాదంటూ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఎయిర్ పోర్ట్ లో కుక్క బిస్కెట్లు మింగేయడం, కుడితిలాగా బిర్లు తాగడం, మద్యం దోపిడి, రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం, వీడు చేయని పని లేదంటూ లోకేష్ ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి
పవన్ ప్లాన్ అదుర్స్.. అక్కడే స్పెషల్ ఫోకస్?