తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు మా ఎన్నికలు వచ్చినా.. సాధారణ ఎన్నికల్లో ఉన్నంత ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మా ఎన్నికల గందరగోళం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మా అధ్యక్ష పదవి పోటీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మొన్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ మెంబర్ల పేర్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రతిష్ఠ మసకబారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు నటుడు నరేశ్ మండిపడ్డారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ… నిన్న ఒక మీడియా సమావేశం జరిగిందని, అందులో కొందరు పలు వ్యాఖ్యలు చేశారని నరేశ్ అన్నారు. మాలో రాజకీయ ఇష్యూలు తలెత్తుతున్నాయని చెప్పారు. టాలీవుడ్లో నటించిన ఎవరైనా సరే మా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చని తెలిపారు. మూడు నెలల క్రితమే ప్రకాశ్ రాజ్ తనకు ఫోన్ చేసి, తాను మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. ఎవరైనా పోటీ చేయొచ్చని తాను చెప్పానని అన్నారు.
మా లో ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయాలు జరగలేదని.. లోకల్.. నాన్ లోకల్ అనే వ్యాఖ్యలు తాము చేయలేదని ఆయన చెప్పారు. ఇక నాగబాబు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. కానీ ఆయన మా ప్రతిష్ఠ మసకబారిందని మాట్లాడటం సరైన పద్దతి కాదని అన్నారు. ఆయన మాటలు తమను బాధపెట్టాయన్నారు. ఆయన మాటలు విని షాక్ అయ్యామని తెలిపారు. మా మసకబారిపోయిందా? ముందు అడుగు వేస్తుందా? అన్న విషయంపై తాము నిన్న జీవితారాజశేఖర్ తో కలిసి చర్చించామని తెలిపారు.
కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జీవితారాజశేఖర్ రూ.10 లక్షల విరాళం ఇచ్చారని చెప్పారు. ఆర్టిస్టుల పింఛనును కూడా తాము పెంచామని నరేశ్ తెలిపారు. పొట్టి వీరయ్య చనిపోతే ఆయన కుమార్తెకు పింఛను బదిలీ చేశామని చెప్పారు. ఒక సీనియర్ నటి తన భర్త కరోనాతో బాధపడుతున్నాంటే రూ.40 వేలకు ఒక్కటి చొప్పున ఇంజక్షన్లు ఐదు ఇప్పించామని అన్నారు. తమకు పేరు రావాలని ఎప్పుడూ చేయలేదని.. మా గౌరవం పెంపొందించాలనే తాపత్రయం ఇక్కడ అందరికీ ఉందని అన్నారు.
ఏకంగా మూడు సిమిమాలను రీమేక్ చేస్తున్న దిల్ రాజు..!
గోపిచంద్ మలినేని.. బాలయ్య సినిమాకు చిన్న బ్రేక్.. కారణం అదే..!