ఇండియన్ టెలికం రంగంలో జియో దెబ్బకు మిగిలిన టెలికం కంపెనీలు అన్ని విలవిల్లాడుతున్నాయి. దాంతో తమ వినియోగదారులను కాపాడుకునేందుకు రోజుకో ఆఫర్ ప్రకటిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రీసెంట్ గా రిలయన్స్ జియోకు పోటీగా టెలికం దిగ్గజం ఎయిర్టెల్ సూపర్ ప్రీపెయిడ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ కొత్త ఆఫర్ చూస్తుంటే జియో సైతం భయపడేలా కనిపిస్తోంది.
ఎయిర్టెల్ తాజా ఆఫర్ ప్రకారం.. రూ.399తో రీచార్జ్ చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ 4జీ డేటా వస్తుంది. దీంతోపాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం 4జీ వినియోగదారులకు మాత్రమే. అయితే దీనిపై ఎయిర్టెల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టెలికం రంగానికి చెందిన కచ్చితమైన లీకులు ఇవ్వడంలో మంచి పేరును బఫ్నా ఈ ట్వీట్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ ప్రకటనే నిజమైతే జియోకు షాక్ తగిలినట్లే అవుతుంది.
Related