Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ.. సూపర్ ఆఫర్ ఇచ్చిన బాబు

- Advertisement -
the former chief minister in tdp

స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌కు చివ‌రి సీఎం, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి అధికార పార్టీ అయిన టీడీఫీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కిషోర్‌కుమార్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో త‌న అన్న స్థాపించిన జై స‌మైక్యాంధ్ర పార్టీ త‌ర‌పున త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

గ‌త మూడేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి కిర‌ణ్‌తో పాటు కిషోర్‌కుమార్‌రెడ్డి ఇద్ద‌రు సైలెంట్‌గా ఉంటున్నారు. ఏడాది కాలంగా కిర‌ణ్ వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌లో చేర‌తారంటూ జోరుగా వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల‌ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నెపథ్యంలో  న‌ల్లారి సోద‌రుల‌ను ప‌రామ‌ర్శించేందుకు జిల్లాకు చెందిన మంత్రి అమరనాధరెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్‌ గీర్వాణీ చంద్రప్రకాష్‌ తదితర ప్రముఖులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ క్రమంలో వారు కిషోర్‌కుమార్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న రాజంపేట ఎంపీ టిక్కెట్టుతో పాటు టీటీడీ చైర్మ‌న్ కావాల‌ని కోరగా.. రాజంపేట ఎంపీ సీటు ఇచ్చేందుకు బాబు ఓకే చెప్పిన‌ట్టు సమాచారం. ఇక సోద‌రుడు టీడీపీలో చేరే విష‌య‌మై కిర‌ణ్ కూడా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కిరణ్ కూడా టీడీపీలో చేరెందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -