జియో తన ఆఫర్లతో.. ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆరేడు నెలలుగా జియో దెబ్బకు ఇతర టెలికం కంపెనీలన్ని భారీగా నష్టపోయాయి. జియో ఫ్రీ సేవల వల్ల తమ రాబడులు ఘోరంగా తగ్గిపోయాయని చాలా కాలంగా నెత్తీనోరూ బాదుకుంటున్నాయి. జియో ఉచిత ఆఫర్లపై ఇతర కంపెనీలు ఫిర్యాదులు చేసిన జియో మాత్రం తన ఉచిత ఆఫర్ల పరంపరను కంటిన్యూ చేస్తోంది.
ఈ క్రమంలోనే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను ఉపసంహరించుకోవాలని ట్రాయ్ సూచించడంతో జియో ఇప్పుడు ‘ధన్ ధనా ధన్’ అనే సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా కస్టమర్లు రూ.309 రీచార్జ్తో 84 రోజులకు 84 జీబీ డేటాను, రూ.509 రీచార్జ్తో 84 రోజులకు 168 జీబీ డేటాను పొందొచ్చు. అంటే రోజుకు దాదాపుగా 1 జీబీ (రూ.309), 2 జీబీ (రూ.509) డేటాను పొందొచ్చు.
దీనితోపాటు ఇక ఎస్ఎంఎస్, కాల్స్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితం. ఇక నాన్–ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను రూ.408, రూ.608 రీచార్జ్లతో పొందొచ్చు. ధన్ ధనా ధన్ ఆఫర్ కేవలం ఒక రీచార్జ్కు మాత్రమే పరిమితం. జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ఉంటే ఇది వర్తించదు. కాగా ఈ ప్లాన్ను వెంటనే రీచార్జ్ చేసుకోవచ్చు. అయితే టారిఫ్లు ఏప్రిల్ 15 తర్వాతి నుంచి అమల్లోకి వస్తాయి.
Related