ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు పై ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే.. మరో వైపు ఇది విఫలమైందని అంటున్నారు. ఈ నెపథ్యంలోనే నరేంద్ర మోడీ రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నోట్ల స్థానంలో ప్రభుత్వం కొత్త 2వేల నోటును తీసుకొచ్చింది.
ఈ 2వేల నోటుతో పాటు 500, 1000 రూపాయల నోటు కూడా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు. రూ.500 నోటు తర్వాత ఒకేసారి మళ్లీ రూ.2000 పెద్ద నోట్లు మాత్రమే ఉండడంతో ఆర్థిక వ్యవస్థలో చాలా అప్ అండ్ డౌన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ చాలా వరకు అతలాకుతలమవుతోంది. ఈ క్రమంలోనే జనాలందరూ కొత్త రూ.1000 నోటు కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త 1000 నోటు బ్యాంక్ లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని తెలుస్తోంది.
మోడీ 1000 నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సంగతిని ఆర్బీఐయే స్వయంగా తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
Related