Friday, May 9, 2025
- Advertisement -

ధోనికి ఈ బుర్ర ఎక్క‌డిది..!

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే.ఇంగ్లండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ని యువ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్‌ కౌల్ వేశాడు. చివరి బంతికి ఎలాగైనా ఒక పరుగు తీసి.. భారత్‌ ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచాలని క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్, జోర్డాన్ నిర్ణయించుకున్నారు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్ ఒకవేళ బంతి బ్యాట్‌కి తగలకపోయినా పరుగు తీయాలని సైగల ద్వారా ఆదిల్ రషీద్‌కి తెలియజేశాడు.

దీన్ని పసిగట్టిన ధోనీ.. ముందుగానే తన కుడిచేతి గ్లౌవ్‌ని తీసేసి రనౌట్‌కి సిద్ధమైపోయాడు. వ్యూహం ప్రకారం సిద్ధార్థ్‌ కౌల్ షార్ట్‌పిచ్ బంతిని విసరగా దాన్ని ఆదిల్ రషీద్ కనీసం టచ్‌ కూడా చేయలేకయాడు. అదే సమయంలో పరుగు కోసం జోర్డాన్ ప్రయత్నించగా అప్పటికే బంతిని అందుకున్న ధోని మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. దాంతో ధోని బ్రెయిన్‌కు హ్యాట్సాఫ్‌ అంటూ క్రికెట్‌ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -