అక్టోబర్ 5 నుండి వరల్డ్ కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మళ్లీ ఫేవరేట్గా బరిలోకి దిగుతుండగా ఆతిథ్య భారత్ కూడా ఈసారి కప్పు కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే భారత్ ఫేవరేట్ అని అంతా భావిస్తుండగా భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం టీమిండియా కప్పు గెలవడం అసాధ్యమని చెప్పి షాకిచ్చాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మళ్లీ కప్పు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ ఆ జట్టు టాప్లో ఉందని…దీనికి తోడు ప్రపంచ స్థాయి ఆల్రౌండర్లు ఆ జట్టుకు కలిసివచ్చే అవకాశం అని తెలిపారు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో సునీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
ఇప్పటివరకు 12 సార్లు వన్డే వరల్డ్ కప్ జరుగగా అత్యధికంగా ఆసీస్ నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఇక భారత్, వెస్టిండీస్ రెండేసి సార్లు విజయం సాధించాయి. అయితే ఈ ఏడాది స్వదేశంలో టోర్నీ జరగనుండటంతో భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో బాంబు పేల్చాడు సునీల్.