బ్యాంకింగ్ రంగంలోకి ఈ వ్యాలెట్ దిగ్గజం పేటీఎమ్ రాబోతోంది.ఇప్పటి వరకుఈ వాలెట్ ద్వార సేవలు అందించిన పేటీఎమ్ మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఆర్బీఐ తుది అనుమతులు మంజూరు చేసింది.
ఈ విషయాన్ని బ్యాంకు పబ్లిక్ నోటీస్లో తెలియజేసింది. ఈ బ్యాంకు లైసెన్స్ విజయ శేఖర్ శర్మ పేరుతో మంజూరైంది.త్వరలోనే పేటీఎమ్ బ్యాంకులను ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన ఈ వాలెట్ వ్యాపారాన్ని ఈ బ్యాంకుకు బదిలీ చేయనుంది. దీనికి ఇప్పటికే 21.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ పీపీబీఎల్లో భాగమవుతుంది .పేటీఎం సొంతమైన వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేరు మీదనే ఈ లైసెన్సులను పీపీబీఎల్ పొందింది.
{loadmodule mod_custom,Side Ad 1}
పీపీబీఎల్ లో పేటీఎం వాలెట్ కలుపడం ఇష్టంలేని వినియోగదారులు మే 23 కంటే ముందు పేటీఎంకు ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేటీఎం వెల్లడించింది.దీంతో వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాలను వినియోగదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తామని చెప్పింది. మే 23 లోపలే వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని పేటీఎం సూచించింది. ఆరునెలల నుంచి వినియోగించని ఈ వాలెట్లోని మొత్తాలను వినియోగదారుల అనుమతితోనే పీపీబీఎల్లోకి మారుస్తారు. దీంతోపాటు పేటీఎం బ్యాంక్ రూ.లక్ష వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.
Related