ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఐపీఎల్ -11 టైటిల్ కు కొత్త స్పాన్సర్ని బీసీసీఐ ప్రకటించింది. అయితే వచ్చే ఐదేళ్లు టైటిల్ స్పాన్సర్గా పేటీఎం వ్యవహరించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. పేటీఎం ఇండియన్ క్రికెట్కు టైటిల్ స్పాన్సర్గా ఉండనుంది.
పేటీఎం, బీసీసీఐ రెండు సత్సంబంధాలు కొనసాగుతాయి. పేటీఎంకు బీసీసీఐ గొప్ప విలువ ఇస్తుంది’’ అని రాజీవ్ తెలిపారు. ఐపీఎల్కు పార్ట్నర్గా ఉండటం సంతోషంగా ఉందని పేటీఎం వ్యవస్థాపకుడు, ఛైర్మెన్ విజయ్ శేఖర్ తెలిపారు.
గత సీజన్ కోసం వివో సంస్థ రూ.100 కోట్లతో టైటిల్ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. గతంలో డిఎల్ఎఫ్, పెప్సీకో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. కాగా 2018 సీజన్ నుంచి 2022 వరకూ పేటీఎం సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ని రూ.439.8 కోట్ల వెచ్చించి దక్కించుకున్నట్లు సమచారం.