మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న `మహాభారత` చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలసిందే. సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికి మోహన్లాల్ పోషిస్తున్న భీముని పాత్ర మాత్రమే పట్టాలెక్కింది. ఈ కథ మొత్తం భీముని పాత్ర చుట్టే తిరగనుంది.
బీఆర్ శెట్టి 1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా నిర్మించనున్నారనే టాక్ రావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన ‘రండా మూళమ్’అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు.
మలయాళం వెర్షన్ కి ఇదే టైటిల్ ను ఉంచేసి, తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం ‘ది మహాభారత’ అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. నటీనటులను కూడా ఆయా భాషల నుంచి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటిభాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.