యోగా గురువు బాబా రామ్దేవ్కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉత్తరాఖండ్ వైద్య సంఘం పరువు నష్టం నోటీసు ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలపై రామ్దేవ్ బాబా వివరణ ఇస్తూ మరో ప్రకటన చేసినప్పటికీ ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది. ఆయనపై రూ.1000 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని ఐఎంఏ కోరింది.
లేకపోతే పరువు నష్టం కింద రూ.వెయ్యి కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతే కాదు రామ్ దేవ్ బాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ సిఎంకు లేఖ రాసింది. కాగా, అల్లోపతి పనికిమాలిన వైద్యమంటూ ఇటీవల రామ్ దేవ్ బాబా వ్యాఖ్యానించారు.
కాగా, తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. అల్లోపతి వైద్య విధానాన్ని కించపరిచేలా యోగాగురు రాందేవ్ బాబా వ్యాఖ్యలు చేశారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అమ్మ నాన్న బ్రేకప్ పై శృతి హాసన్ రియాక్షన్.. విడిపోవడమే కరెక్ట్ అంటూ?