ప్రముఖ దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర)తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు ఆచార్య షూటింగ్లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్లో నటించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బాబీతో ఓ సినిమా చేయబోతున్నాడు. బలుపు, జై లవకుశ వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన బాబీ చెప్పిన ఓ కథ చిరంజీవికి తెగ నచ్చిందట. దీంతో బాబీకి చాన్స్ ఇచ్చాడు.
నిజానికి బాబీ .. చిరంజీవికి వీరాభిమాని. గతంలో చిరంజీవి అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. అలాంటిది తన అభిమాన హీరోతోనే సినిమా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం చిరు-బాబి కొత్త చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఈ చిత్రంలో చిరంజీవి సినిమా హీరోగా కనిపించబోతున్నాడట. ఓ సినిమా హీరోకు అతడి అభిమానికి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. నిజానికి చిరంజీవి కమర్షియల్ కథలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటాడు. ఇదిలా ఉంటే బాబి-చిరు కాంబినేషనల్ వచ్చే సినిమా మాత్రం కాస్త ప్రయోగాత్మకంగానే ఉండబోతున్నదని టాక్ వినిపిస్తోంది.
Also Read
తగ్గేదెలా అంటున్న వెంకీ మామ..!