బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ దర్శకత్వంలో ఆమె ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో దేశ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..మీడియాపై ఎలాంటి ఆంక్షలు విధించారు వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడింది.
ఇక ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తుండగా అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.