Monday, April 29, 2024
- Advertisement -

కంగనా రాత..ఇప్పుడైనా మారుతందా!

- Advertisement -

ఒక్క సినిమా హిట్ అయితే చాలు అమాంతం ఎవరెస్ట్ ఎక్కేస్తారు కొంతమంది. తాము ఎక్కడి నుండి వచ్చాం, గతమెంటీ అన్నది మర్చిపోతారు. కానీ కొంతమంది స్టార్ రేంజ్ వచ్చినా సామాన్యుడిలా ఉండిపోతారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా…అదే మన క్వీన్ కంగనా రనౌత్ గురించి. సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. మణికర్ణిక సినిమాతో దర్శకురాలిగా మారినా ఈ సినిమాతో దర్శకుడు క్రిష్‌తో సైతం గొడవ పెట్టుకుంది ఈ బ్యూటీ.

ఈ సినిమా తర్వాత కంగనా ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. తానే సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అనేంత బిల్డప్ ఇచ్చింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాదా అందుకే ఆమె సినిమాలు బాక్సాఫీస్ ముందు పెద్ద డిజాస్టర్‌లుగా మిగులుతున్నాయి. చంద్రముఖి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. తర్వాత తేజస్ అనే సినిమాతో వచ్చినా అది నిరాశే పర్చింది. సైనికుల నేపథ్యంలో తెరకెక్కిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దీంతో కంగనా దిగిరాక తప్పలేదు. ద్వారకను సందర్శించింది కంగనా. ఈ సందర్భంగా ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ పెట్టింది. కొన్ని రోజులుగా నా గుండె చాలా బాధగా ఉంది. ద్వారకాధీశుని దర్శించాలనిపించింది. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి ని రాసుకొచ్చింది. కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ సినిమాలో ఇందిరాగాంధీ ఓ పాత్రలో నటిస్తోంది. దర్శఖత్వం కూడా కంగనానే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతుందో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -