- Advertisement -
మహేశ్ బాబుకి క్రికెట్లో గ్రౌండ్లో ఏం పని అనుకుంటున్నారా? ఏం లేదండీ మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో మహేశ్ కాలేజ్ స్టూడెంట్గా కనిపించనున్నాడు.తాజాగా ఈ సినిమాలోని కొన్ని ఫైట్ సీన్స్ను ఓ క్రికెట్ గ్రౌండ్లో చిత్రికరిస్తున్నారు. ప్లే గ్రౌండ్ లో కాలేజ్ కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవలను గతంలో చాలా సినిమాల్లో చూపించారు.
అందుకు భిన్నంగా చూపించడానికే వంశీ పైడిపల్లి ప్రయత్నం చేశాడట. ఇక ఈ సినిమా మహేశ్ కెరీర్లో 25వ సినిమా కావడంతో చాలా ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఇక సినిమాలో మహేశ్కు జంటగా పూజ హెగ్డె నటిస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు-అశ్వీనిదత్ ఇద్దదరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.వచ్చే ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.