దక్షిణాదిన మల్టీస్టారర్ సినిమాలంటే ఒకప్పుడు క్రేజ్ చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారిపోయింది. ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వివిధ భాషల్లో హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుండటం కూడా ఈ తరహా సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
ఇక తాజాగా ఓ అదిరే మల్టీస్టార్ మూవీ రాబోతుందని సమాచారం. జైలర్ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్, మమ్ముట్టి, విజయ్తో కలిసి సినిమా చేయనున్నారని టాక్ నడుస్తోంది. మహేష్, మమ్ముట్టితో కలిసి ఓ సినిమా చేయాలనుందని, అలాగే కుదిరితే ఈ సినిమాలో షారుఖ్ని కూడా భాగస్వామిని చేస్తానని తెలిపారు.
రజనీ జైలర్ సినిమాలో కన్నడస్టార్ రాజ్ కుమార్,మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కు మంచి పాత్ర ఇచ్చిన నెల్సన్…ఇప్పుడు తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.