బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు పాన్ఇండియా స్థాయిలో మార్కెట్ పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ ముంబైలో ఉంటూ హిందీలో కూడా తన రేంజ్ పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ షూటింగ్ చివరిదశకు చేరుకున్నది. పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
ఇక దీని తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ నటిస్తుండగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతోంది. అలాగే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సలార్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతోందట.
ఇదిలా ఉంటే ప్రభాస్తో ఓ భారీ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను హీరోయిన్గా ఎంపికచేశారు. ఇవాళ ఈ ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో బిగ్బీ అమితాబ్ బచ్చన్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తునట్లు సమాచారం. మొత్తానికి ప్రభాస్ నటించే మరో పాన్ ఇండియా మూవీ మొదలు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read
భీమ్ విషయం ఓకే.. మరి అల్లూరి సంగతేంటి?
రాజమౌళి – మహేష్ బాబు సినిమా కథ ఇదేనా..!
సార్ మీ కులపోడినే.. కొద్దిగా చాన్స్ ఇవ్వరూ..!