దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు వచ్చారు.
ఇవాళ తెల్లవారుజామున డ్రాగన్ క్యాప్సుల్ అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలోని సముద్రజలాల్లో ల్యాండ్ అయింది. 4 ప్యారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది.
నాసా సిబ్బంది బోట్ల సాయంతో దానిని నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్ దాన్ని లిఫ్ట్ చేసి తర్వాత క్యాప్సుల్ డోర్ను ఓపెన్ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.