టాలీవుడ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన దర్శకుడిలో ఒకరు రాజమౌళి. బాహుబలి ముందు తర్వాత తెలుగు ఇండస్ట్రీ అనేంతలా గుర్తింపు తెచ్చారు జక్కన్న. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్తో భారతీయ సినీ పరిశ్రమ ముఖ్యంగా టాలీవుడ్ వైపు అంతా చూసేలా చేశారు. ఈ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలో జక్కన్న, ఆయన సతీమణి రమా రాజమౌళికి అరుదైన ఘనత దక్కింది.2025 ఆస్కార్ విజేతలను ఎంపిక చేసి ఆస్కార్ అకాడమీ సభ్యులుగా ఎన్నికయ్యారు రాజమౌళి దంపతులు. దర్శకుల కేటగరిలో రాజమౌళి,కాస్ట్యూమ్స్ డిజైన్ విభాగంలో రమా రాజమౌళి ఎంపికయ్యారు.మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాని మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో సిద్ధం చేయగా ఇందులో వీరిద్దరికి కూడా అకాడమీ ఆహ్వానం పలికింది.
ప్రస్తుతం రాజమౌళి…సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.