సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజమౌళి – మహేష్ కాంబోలో తొలిసారి సినిమా వస్తుండగా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా మూవీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అంతేగాదు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని త్వరలోనే షూటింగ్ ప్రారంఢవముతుందని చెప్పి గుడ్ న్యూస్ చెప్పారు జక్కన్న.
ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ బడ్జెట్తో తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేయగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మహేష్తో ఆలియా భట్ అనే వార్త క్రేజీ న్యూస్గా మారగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ పుస్తకాల ఆధారంగా మహేష్ మూవీ స్క్రిప్ట్ ఉండనుందని సమాచారం. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.