- Advertisement -
కాపులను బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం ఆఖరుకి ఆమరణకు దీక్ష దశకు చేరుకుంది..ముందనుకున్న ముహూర్తం ప్రకారం ముద్రగడ కిర్లంపూడిలో ఉదయం తొమ్మిది గంటలకు తన ఇంటి వద్ద ఆయన సతీమణి ఆమరణ నిరాహార దీక్షకు సమాయత్తమయ్యారు.
కాపుల రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం తన పోరాటం ఆగదన్నారు ముద్రగడ పద్మనాభం. దీక్షకు సంఘీభావంగా ఎవరూ కిర్లంపూడికి రావద్దని తెలిపారు. ఎవ్వరి ఇంటిల్లో వారు మద్యాహ్నం భోజనం మానేయాలన్నారు, ప్లేటుపై గరిటెతో కొట్టాలని ఆ శబ్ధం సీఎం చెవిలో పడాలని చెప్పారు. ఆ శబ్దం విన్న సీఎం తమకు న్యాయం చేస్తారని ఆశిద్దామన్నారు. దీనికి తోడు ముద్రగడ దీక్ష ప్రారంభమైన వెంటనే మిగిలిన చోట్ల కూడా కాపు నాయకులు దీక్షలు మొదలు పెట్టేందుకు సమాయత్తమయ్యారు.