- Advertisement -
జనసేన అధినేత పవన్పై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు మాజీ మంత్రి, వైసీపీ ముద్రగడ పద్మనాభం. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ..వృద్ధ నారి ప్రతివతలా పవన్ కళ్యాణ్ తీరు ఉందని మండిపడ్డారు.
పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. వంగ గీత కాపు కాదా, నువ్వేనా కాపు? నువ్వు కచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయట పెట్టు అని డిమాండ్ చేశారు.మెగా కుటుంబంలో ఒక అమ్మాయి నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన హీరోని ప్రేమించిందని.. అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశారని దుయ్యబట్టారు.
నేను కచ్చితమైన కాపును.. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలన్నారు. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే ఇప్పిస్తాను… నా కూతురు, నేను దుష్టుల వల్ల దూరం అయ్యాం… వచ్చే జన్మలో కలుద్దామన్నారు.