అమెరికాలో కొద్ది రోజులుగా కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్ కట్టడికి మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చాలా రాష్ట్రాలు, స్థానిక అధికారులు కఠిన నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రిపబ్లికన్ గవర్నర్లు మాస్క్లు తప్పనిసరి చేశారు. పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు.
మాస్క్లు ధరించటం, భౌతిక దూరం పాటించటం వెనక ఉన్న శాస్త్రీయ మూలాన్ని ప్రశ్నించే వారికి ఈ చర్యలు నచ్చకపోవచ్చు. కొత్త ఆంక్షలతో భారీగా ఉద్యోగాలు కోల్పోవటం, పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారి భయపడుతుండటమే అందుకు కారణం. వచ్చే వారం థ్యాంక్స్గివింగ్ హాలిడే వస్తున్న క్రమంలో భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య అధికారులు పేర్కొంటున్నారు. చాలా తక్కువ మందితో థ్యాంక్స్గివింగ్ను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.
ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!